తమిళనాడులో చోరీ చేసి పారిపోతుంటే.. వెంటాడి పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

తమిళనాడులో చోరీ చేసి పారిపోతుంటే.. వెంటాడి పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని హోసూరులో జరిగిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో నలుగురు దోపిడీ దొంగలను సైబరాబాద్ పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు.  తమిళనాడు నుంచి హైదరాబాద్ మీదుగా  కర్ణాటక పారిపోయేందుకు దోపిడీ దొంగలు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారంతో అలర్టయిన  సైబరాబాద్ పోలీసులు దోపిడీ దొంగలను వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. వీరు పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

36 పరుగుల ఆలౌట్ అవమానానికి కౌంటర్

సిరాజ్‌ ను ప్రశంసల్లో ముంచెత్తిన టీమిండియా హెడ్​ కోచ్​ రవిశాస్త్రి

V6 న్యూస్ రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు