- కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుంటున్నట్టు రోహిణి ప్రకటన
పాట్నా: బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. కుటుంబం తోనూ తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ లో ఆమె పోస్ట్ పెట్టారు. “నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నాను. నా కుటుంబంతోనూ తెగదెంపులు చేసుకుంటున్నాను.
సంజయ్ యాదవ్, రమీజ్ అలామ్ ఇచ్చిన సూచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. అన్ని విమర్శలకు నేను బాధ్యత వహిస్తాను’’ అని పేర్కొన్నారు. రోహిణీ ఆచార్య కొన్నేండ్ల క్రితం తండ్రికి కిడ్నీదానం చేసి వార్తల్లో నిలిచారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో సరన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సోదరుడైన తేజ్ ప్రతాప్ను తన తండ్రి ఆర్జేడీ నుంచి బహిష్కరించడంతో రోహిణి అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోం ది. అయినప్పటికీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ కోసం ఆమె ప్రచారం నిర్వహించారు.
