ఢిల్లీ జైలులో కరోనా కలకలం

ఢిల్లీ జైలులో కరోనా కలకలం
  • అసిస్టెంట్ సూపరింటెండెంట్​కు వైరస్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. జైలులో హెడ్ వార్డెన్ తో పాటు 15 మంది ఖైదీలకు వైరస్ సోకిందని తెలిసిన మరుసటి రోజే అసిస్టెంట్ సూపరింటెండెంట్ కు రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని అధికారులు బుధవారం తెలిపారు. మూడ్రోజుల కిందట ఆఫీసర్​కు గొంతు నొప్పి, షుగర్ లెవెల్స్ పెరగడంతో సెలవు మీద పంపించామని ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఆయన నుంచి శాంపిల్స్ తీసుకుని టెస్టులకు పంపించగా వైరస్ బారిన పడినట్లు తేలిందన్నారు. తీహార్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న ఆయనను ఆస్పత్రికి చేర్పించామని, ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించామని చెప్పారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న సిబ్బందిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్ సూచించామని తెలిపారు.