
వన్డే వరల్డ్కప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రోహిత్ స్పందించాడు. తాను ఔటైన తీరును ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఆ ఔట్ను జూమ్ చేసి మరీ అభిమానులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే తలపట్టుకున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. ‘ ఇప్పుడు చెప్పండి.. ఇది ఔటా’ అని రోహిత్ కోరుతున్నట్లు ఉన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
?♂️? pic.twitter.com/0RH6VeU6YB
— Rohit Sharma (@ImRo45) June 28, 2019