యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి(Rohit Shetty) డైరెక్షన్లో వస్తోన్న వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్(Indian Police Force). సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సీరీస్ ద్వారా ముగ్గురు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లను పరిచయం చేయబోతున్నాడు.
వరుస బాంబు పేలుళ్లతో భారత రాజధాని ఢిల్లీని వణికిస్తున్న..ఓ టెర్రర్ గ్రూపును పట్టుకునే పనిలో భాగంగా నగర పోలీసులంతా వెతుకుతుంటారు. అలా ఓ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు వారిని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగి..ఎలాంటి త్యాగాలు చేశారన్నది ఈ సిరీస్ లో ఆసక్తిగా చూపించారు. ఈ వెబ్ సీరిస్ లో మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉండనున్నాయి. అయితే ఈ ఎపిసోడ్లన్నీ ఒకేసారి రిలీజ్ చేస్తారా అనే విషయాన్ని వెల్లడించలేదు.
ప్రస్తుతం కొన్ని వెబ్సిరీస్లు ఒక్కో వారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ అవుతున్నాయి. అలా లేటెస్ట్ ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్..ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా..మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ ఇస్లామిక్ ఉగ్రవాదం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న కథాంశాన్ని సూచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్ను రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇషా తల్వార్, విభూతి ఠాకూర్, కరణ్వీర్ మల్హోత్రా, నికితిన్ ధీర్, శ్వేతా తివారీ, శరద్ కేల్కర్, ముఖేష్ రిషి, మృణాల్ కులకర్ణి, మయ్యంక్ టాండన్, రీతూ రాజ్ సింగ్ తదితరులు ఈ సిరీస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.