బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్రాయిస్ ఇండియా మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్ను లాంచ్ చేసింది. దీని ఎక్స్షోరూం ధర రూ.7.5 కోట్లు. ఇందులోని ఇంజన్ 577 హెచ్పీని, 900 ఎన్ఎం పీక్టార్క్ను ఇస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కారులో 195 కిలోవాట్ల బ్యాటరీని చార్జ్ చేయడానికి 34 నిమిషాలే పడుతుందని కంపెనీ తెలిపింది.