రోల్స్​రాయిస్​ కొత్త కారు @ రూ.7.5 కోట్లు!

రోల్స్​రాయిస్​ కొత్త కారు @ రూ.7.5 కోట్లు!

బ్రిటిష్​ లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్​రాయిస్​ ఇండియా మార్కెట్​లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్​ కారు స్పెక్టర్​ను లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ.7.5 కోట్లు. ఇందులోని ఇంజన్​ 577 హెచ్​పీని, 900 ఎన్​ఎం పీక్​టార్క్​ను ఇస్తుంది. ఒక్కసారి చార్జ్​ చేస్తే 520 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కారులో 195 కిలోవాట్ల బ్యాటరీని చార్జ్​ చేయడానికి 34 నిమిషాలే పడుతుందని కంపెనీ తెలిపింది.