- ఏపీ నుంచి డిప్యుటేషన్పై తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రోస్ భార్య విశాలచ్చిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్గా ఉన్న విశాలచ్చిని, డిప్యుటేషన్పై తెలంగాణ కు తీసుకొచ్చారు. ఈ నెల 30న తెలంగాణ ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేయగా, తాజాగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. సీఎం కేసీఆర్కు.. రొనాల్డ్ రోస్ సన్నిహితం గా ఉంటారన్న పేరు ఉంది. ఈ నేపథ్యంలో సీఎంచొరవతోనే
ఏపీ నుంచి విశాలచ్చిని తీసుకొచ్చి ఈ పదవి కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.