ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన రోనాల్డ్ రో స్

ఎల్బీ  స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన రోనాల్డ్ రో స్

ఎల్బీ  స్టేడియంలో రేపు నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శానిటేషన్ ఏర్పాట్లపై  జీహెచ్ఎంసీ  కమిషనర్ రోనాల్డ్ రో స్ పరిశీలించారు.  Evdm డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రే, చీఫ్ వెటర్నరీ  డా క్టర్ అబ్దుల్ వాకీల్ అడిషనల్ కమిషనర్ లు స్నేహ శబరిష్, యాదగిరి రావు ఉపేందర్ రెడ్డి సి ఏం అండ్ హెచ్ ఓ  డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.  

2023 డిసెంబర్ 07వ తేదీ  గురువారం ఉదయం 10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రేవంత్‌ సహా 9 లేదా 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం.  మంత్రి వర్గ కూర్పుపై చర్చించేందుకు నిన్న రాత్రి రేవంత్ ఢిల్లీకి వెళ్లారు.  అక్కడ డీకే శివకుమార్,  మాణికం ఠాగూర్‌లతో భేటీ అయ్యారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ భేటీ కానున్నారు. తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాల్సిందిగా రేవంత్ సోనియా, రాహుల్, ప్రియాంకలను కోరనున్నారు.   వారికున్న సమయాన్ని బట్టి ఆయా నేతలు వచ్చేది రానిది బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

సీఎంగా రేవంత్ తోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 12 మంది మంత్రులూ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. బుధవారం హైకమాండ్‌‌ భేటీలో వీటిపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కేబినెట్‌‌లో చోటుదక్కించుకునేది వీళ్లేనంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.