హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల కోడ్అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో రూ.12.87 కోట్ల నగదు సీజ్చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ తెలిపారు. రూ.1.86 కోట్ల వివిధ రకాల వస్తువులు, 19,798 లీటర్ల లిక్కర్ను పట్టుకున్నట్లు వెల్లడించారు.
146 మందిపై కేసులు నమోదు చేసి, 140 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు.