హైదరాబాద్‌లో తనిఖీల్లో రూ.12.87 కోట్లు సీజ్

హైదరాబాద్‌లో  తనిఖీల్లో రూ.12.87 కోట్లు సీజ్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్​ జిల్లాలో రూ.12.87 కోట్ల నగదు సీజ్​చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ​రోనాల్డ్​రోస్ తెలిపారు. రూ.1.86 కోట్ల వివిధ రకాల వస్తువులు, 19,798 లీటర్ల లిక్కర్​ను పట్టుకున్నట్లు వెల్లడించారు.

146 మందిపై కేసులు నమోదు చేసి, 140 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు.