ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీ పొడిగింపు

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు డిసెంబర్ 4 వరకు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు సంజయ్ సింగ్‌‌‌‌ను శుక్రవారం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా సంజయ్ సింగ్ కస్టడీని పొడిగిస్తూ స్పెషల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. 

కాగా, లిక్కర్ కేసులో సంజయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈడీ అధికారులు అక్టోబర్ 4న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టులో హాజరుపర్చగా, కస్టడీకి తరలిస్తూ స్పెషల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు.