మద్యం మత్తులో గొడవ.. ఓ వ్యక్తి దారుణహత్య

మద్యం మత్తులో గొడవ.. ఓ వ్యక్తి దారుణహత్య

జగిత్యాల జిల్లాలో దసరా పండుగ వేళ ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి మద్యం మత్తులో జరిగినట్టు పోలీసులు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ లో పీకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రౌడీషీటర్ శేఖర్ ను మహేష్ అనే వ్యక్తి కత్తితో మెడపై దాడి చేశాడు. దీంతో రౌడీషీటర్ శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.