రైస్ మిల్ వ్యాపారిపై ఆర్ఆర్ యాక్ట్

రైస్ మిల్ వ్యాపారిపై ఆర్ఆర్ యాక్ట్

నర్సాపూర్, వెలుగు :  నర్సాపూర్ పట్టణానికి చెందిన వ్యాపారి పైడి శ్రీధర్ గుప్తా ఆస్తులపై రెవెన్యూ ఆఫీసర్లు రెవెన్యూ రికవరీ యాక్ట్(ఆర్ఆర్) అమలు చేశారు. 2021-, 2022కు సంబంధించి తీసుకున్న వరి ధాన్యానికి బియ్యాన్ని సివిల్ సప్లై శాఖకు సరఫరా చేయాల్సి ఉంది. 

దాదాపు రూ.47 కోట్లకు పైగా బకాయి పడడంతో గురువారం తహసీల్దార్​ కమలాద్రి ఆధ్వర్యంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేశారు. దీని కింద విచారణ జరిపి 2 కార్లు, ఎల్ఈడీ టీవీ సీజ్ చేసినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు.