RRR కన్స్ట్రక్షన్ నిర్లక్ష్యానికి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు బలి

RRR కన్స్ట్రక్షన్ నిర్లక్ష్యానికి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు బలి

కుత్బుల్లాపూర్ కొంపల్లిలో RRR నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల ఇద్దరి భవన నిర్మాణ కార్మికులు బలి అయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

కొంపల్లిలోని RRR(కన్స్ట్రక్షన్) భవన నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ఇద్దరు లేబర్లపై ప్రమాదవశాత్తు గ్రానైట్ రాయి పడింది. దీంతో శిత శరణ్(36), లక్ష్మణ్ బరాక్(25)లకు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టు పక్కల వారు దీన్ని గమనించి.. వారిని గ్రానైట్ రాయిలో నుంచి బయటకు తీసి.. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలయిన వారు మార్గమధ్యలోనే మృతి చెందారు.

కనీస జాగ్రత్తలు పాటించకుండా పనులు చేస్తుండటం వల్లనే కార్మికులు మృతి చెందారని తోటి కార్మికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు జార్కండ్, మధ్య ప్రదేశ్ కు చెందిన వారని తెలిపారు పోలీసులు.