
బషీర్బాగ్,వెలుగు: స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట ఓ వృద్ధుడి వద్ద స్కామర్లు భారీగా డబ్బు కాజేశారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ఐఫెక్స్ క్యాపిటల్ పేరుతో స్కామర్లు సెబీ , ఎఫ్ఎస్సీ ఫేక్ డాక్యుమెంట్లు షేర్ చేశారు. వారిని నమ్మి రూ.19 లక్షల 9 వేలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తరువాత స్కామర్లు నంబర్ బ్లాక్ చేయడంతో స్కామ్ అని గుర్తించాడు.
ఫేక్ డీమార్ట్ యాప్తో రూ.1.17 లక్షలు..
నల్లకుంట ప్రాంతానికి చెందిన 66 ఏళ్ల వృద్ధుడికి స్కామర్స్ డీమార్ట్ రెడీ యాప్ పేరుతో ఓ లింక్ను పంపారు. కిరాణా సామాన్లు డిస్కౌంట్ గా వస్తాయని పేర్కొన్నారు. దీంతో వృద్ధుడు ఆ లింక్ క్లిక్ చేసి క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేశాడు. వెంటనే ఆయన అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ.లక్షా 17 వేలు డెబిట్ అయ్యాయి.