చార్టర్డ్ అకౌంటెంట్ ను నమ్మించిరూ.40 లక్షల మోసం..నకిలీ ఐపీఎస్ శశికాంత్ పై మరో కేసు

చార్టర్డ్ అకౌంటెంట్ ను నమ్మించిరూ.40 లక్షల మోసం..నకిలీ ఐపీఎస్ శశికాంత్ పై మరో కేసు

జూబ్లీహిల్స్, వెలుగు: నకిలీ ఐఏఎస్, -ఐపీఎస్ శశికాంత్ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా చార్టర్డ్ అకౌంటెంట్​ను మోసం చేసి రూ.40 లక్షలు కొట్టేసినట్లు మధురానగర్ పీఎస్​లో మరో కేసు నమోదైంది.

 శ్రీనగర్ కాలనీకి చెందిన కోటేశ్వరరావు చార్టర్డ్ అకౌంటెంట్. మధ్యవర్తి ద్వారా కోటేశ్వరరావుకు పరిచయమైన శశికాంత్ పీఎఫ్, జీఎస్టీ  చేయించుకున్నాడు. అనంతరం అప్పుడప్పుడు కోటేశ్వరరావు కార్యాలయానికి అధికారి హోదాలో వస్తూ పోతూ ఉండేవాడు.

 ఈ క్రమంలో ఎస్సార్​నగర్​లో ప్లాట్ కొనేందుకు కొంత డబ్బు తక్కువగా ఉందని నమ్మించి, 2023 డిసెంబర్ 16న రూ.40 తీసుకున్నాడు. తర్వాత నంబర్లు బ్లాక్ చేసి మిస్సింగ్​అయ్యాడు.  ఇటీవల శశికాంత్​ను  ఫిలింనగర్ పోలీసులు పట్టుకుని రిమాండ్​కు తరలించగా, విషయం తెలుసుకొని మధురానగర్​పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.