కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్

కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్

మేడ్చల్ మల్కాజిగిరి: కూకట్పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 54లక్షల 52వేల పోలీసులు నగదును స్వాధీనం  చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున కూకట్పల్లిలోని అల్లూరి కాంప్లెక్స్ దగ్గర సైబరాబాద్ ఎస్వోటీ, బాలానగర్ టీమ్, కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా తనఖీలు నిర్వహిస్తుండగా..ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాహనంలో సరియైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్ చేశారు. 

అక్రమంగా డబ్బును తరలిస్తున్న మహ్మద్ ఇటాచీ కి చెందిన సెక్యూరిటీ ఖలీల్,ఇటాచీ మేనేజ్మెంట్ సర్వీసెస్లో కస్టోడియన్ నగేష్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.