ఎయిర్ పోర్టులో రూ. 8 లక్షల ఫారిన్ కరెన్సీ సీజ్

ఎయిర్ పోర్టులో రూ. 8 లక్షల ఫారిన్ కరెన్సీ  సీజ్

శంషాబాద్, వెలుగు: ఫారిన్ కరెన్సీని తరలిస్తున్న ప్యాసింజర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. షార్జా వెళ్లేందుకు ఓ ప్యాసింజర్ బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చాడు. అతడి లగేజీని తనిఖీ చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు ఫారిన్ కరెన్సీని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ప్యాసింజర్  నుంచి 25 వేల సౌదీ రియాల్స్, 22,500 యూఏఈ దీరమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టబడ్డ కరెన్సీ విలువ సుమారు రూ. 8 లక్షల 795 ఉంటుందని అంచనా వేశారు. కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.