ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ 2020లో విద్యారంగానికి రూ. 99, 300 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ. 3000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. కొత్త ఎడ్యూకేషన్ పాలసీని తీసుకొస్తామని ఆమె తెలిపారు.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2020-2021 సంవత్సర కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్కు ఇది రెండవసారి. 2020బడ్జెట్పై దేశం మొత్తం భారీ అంచానాలను పెట్టుకుంది. ప్రజల ఆదాయం పెంచె దిశగా బడ్జెట్ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఇది సామాన్యుల బడ్జెట్గా ఆమె అభివర్ణించారు.
