పేదల కోసం ప్రాణాలిస్తా : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

పేదల కోసం ప్రాణాలిస్తా : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్​నగర్, వెలుగు: సీఎం కేసీఆర్ లెక్క ఆస్తుల సంపాదన తనకు వద్దని, సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి కావాలన్నదే తన కోరికని ఇందుకు ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.  సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం కార్యకర్తలు, నాయకులతో మీటింగ్ నిర్వహించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తన కుటుంబ ఖాతాలో రూ.82,500 కోట్లు వేసుకున్నారని ఆరోపించారు.  

సీఎం కేసీఆర్ ఇంట్లో కుక్కలకు కూడా ఏసీ కార్లు ఉన్నాయని, అదే రాష్ట్రంలో పేదలకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.