బినామీల పేరుతో భూ దందాలు

బినామీల పేరుతో భూ దందాలు
  • ఇప్పుడేమో మళ్లీ ఆర్టీసీ భూములపై పడ్డరు
  • కేసీఆర్, కేటీఆర్​పై ప్రవీణ్​కుమార్​ఫైర్​
  • బీఎస్పీ స్టేట్​చీఫ్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్

హైదరాబాద్: బీఆర్ఎస్​సర్కార్​పై బీఎస్పీ స్టేట్​ చీఫ్ ​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్​భూదందాలపై ట్విటర్​వేదికగా ఫైర్​అయ్యారు. ‘పేదల పొట్టగొట్టి కేసీఆర్ ప్రభుత్వం చేసినంత భూ దందా ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయలే. బుద్వేల్ లో వెసెల్లా, గచ్చిబౌలిలో ఫీనిక్స్ లాంటి ఎన్నో భూమాఫియా కంపెనీలను కేసీఆర్, కేటీఆర్​ద్వయం యథేచ్ఛగా నడుపుతున్నది. రీజినల్ రింగు రోడ్డు, యాదాద్రి భూముల చుట్టూ చాలా అసైన్డ్ భూములు ఇప్పటికే గుంజుకున్నరు. 

ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ భూముల మీద కూడా పడ్డరు! ఇందులో బాధితులందరూ బహుజనులే. ఈ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు  వాళ్ల వర్గ ప్రయోజనాలను ఎప్పుడో మరచిపోయి చెంచాలుగా తయారయ్యిండ్రు. కల్వకుంట్ల కుటుంబం బినామీల ద్వారా పేదల దగ్గర అక్రమంగా గుంజుకున్న ప్రతి గజాన్ని మళ్లీ వాళ్లకిప్పిస్తం. అందులో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేస్తం. ఈదందాలో సహకరించిన అందరు అధికారులను జైలుకు పంపుతం. ఈ తెలంగాణ ప్రభుత్వ అక్రమ భూదందాల మీద సమాచారాన్ని దయచేసి 9777909777 కు ఇవ్వండి లేదా http://mybsp.in  లో పంచుకోండి’ అని ఆర్ఎస్పీ ట్వీట్​చేశారు.