ప్రజా బలం బీఎస్పీ వైపే: ప్రవీణ్ కుమార్

ప్రజా బలం బీఎస్పీ వైపే:  ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: ప్రజా బలం బీఎస్పీ వైపే ఉందని ఆ పార్టీ స్టేట్​చీఫ్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​అన్నారు. కార్యకర్తలు మరో రెండు నెలలు రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ఏనుగుపై ప్రగతి భవన్ కు​వెళ్లాలని సూచించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్​ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన ఎన్నికల నగారా సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాన్షీరామ్ దేశ రాజకీయాలను మలుపుతిప్పిన యోధుడని కొనియాడారు. వచ్చే ఎన్నికలు కొండ చిలువలకు, చలిచీమల మధ్య జరుగుతాయన్నారు. 

ఇది కాన్షీరాం కల: రాంజీ గౌతమ్ 

ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాన్షీరాం నాటి ఉమ్మడి ఏపీలో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని కలలు కన్నారని బీఎస్పీ నేషనల్ కో- ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు. ఆయన కలను నిజం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అంబేద్కర్ వల్లే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు హక్కులు వచ్చాయని  రాష్ట్ర చీఫ్​ కో ఆర్డినేటర్​ మంద ప్రభాకర్ అన్నారు.