హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో దళితులపై ఎంత వివక్ష ఉందో చూడాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ‘‘అసలైన దళిత బాంధవుడు తానే అని దేశ మంతా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రకటించుకున్న కేసీఆర్.. అంబేద్కర్ విగ్రహాల సంగతి తర్వాత. ముందు మీ సొంత నియోజకవర్గంలో దళితులపై ఎంత వివక్ష ఉందో చూడండి. ఇదంతా మీకు, మీ అనుచరులకు తెలవకుండానే జరుగుతదా?” అని ప్రవీణ్ కుమార్ ట్వీట్లో ప్రశ్నించారు.