పాండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే మహ్మద్​ షకీల్ ఆమేర్​

పాండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే మహ్మద్​ షకీల్ ఆమేర్​

బోధన్, వెలుగు: బోధన్​లోని పాండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహ్మద్​షకీల్ ఆమేర్ ​పేర్కొన్నారు. బుధవారం ఆయన చెరువులో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా షకీల్​ మాట్లాడుతూ పాండు చెరువు అభివృద్ధికి రూ.5.15 కోట్లు కేటాయించామని, పనులు కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని చెరువుల్లో 4.50 కోట్ల చేపపిల్లలు రూ.25 లక్షల రొయ్య పిల్లలు వదులుతున్నట్లు చెప్పారు.

 మత్స్యకారుల కోసం రూ.5.68 కోట్లతో సబ్సిడీపై మోపెడ్​ వాహనాలు అందించినట్లు తెలిపారు. చేపల మార్కెట్ ​నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. బోధన్​ఎమ్మెల్యేగా, మంత్రిగా 15 ఏండ్లు పదవిలో ఉన్న సుదర్శన్​రెడ్డి ద్వారా నియోజకవర్గానికి ఒరిగిందేమి లేదన్నారు. అనంతరం రాకాసిపేట్​లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్​లీడర్లు రాంకిషన్​రావ్,​ రవీంద్ర యాదవ్, ఎమ్మార్వో గంగాధర్, మున్సిపల్​ కమిషనర్ ఖమర్​ హైమ్మద్ పాల్గొన్నారు.