కల్వర్ట్ ను ఢీ కొట్టిన బస్సు..10 మందికి గాయాలు

కల్వర్ట్ ను ఢీ కొట్టిన బస్సు..10 మందికి గాయాలు

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ దగ్గర ఆర్టీసీ బస్సు  కల్వర్ట్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. బస్సులో దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.