ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి

ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి

ఈ మధ్య అకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. రోడ్లపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. ఇటీవలె వందే భారత్ రైళ్లపై అకతాయిలు రాళ్లతో దాడి చేశారు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. జగిత్యాల జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. 
  

నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుతున్న హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ‍్యక్తులు రాళ్లదాడి చేశారు. జగిత్యాల మంచినీళ్ల బావి సమీపానికి బస్సు రాగానే ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దుండగులు బస్సు వెనక నుంచి రాళ్లు విసరడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనలో మెట్ పల్లికి చెందిన ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. 

బస్సు వెనక నుంచి అకతాయిలు దాడిచేసి పారిపోయారని కండక్టర్ తెలిపారు. బస్సులో మొత్తం 70 మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.