హైదరాబాద్​ - విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సులు బంద్​

హైదరాబాద్​ - విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సులు బంద్​

భారీ వర్షాల నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్​ – విజయవాడ మార్గాల్లో రెగ్యులర్​ సర్వీసు బస్సులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన జులై 28న ట్వీట్​చేశారు. 

ట్వీట్​లోని వివరాల ప్రకారం. .  హైదరాబాద్​ విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏపీ లోని కృష్ణా జిల్లా కీసర టోల్​గేట్​ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. 

AsloRead:తెగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు

ఈ నేపథ్యంలో ఆ మార్గాల్లో టీఎస్​ఆర్టీసీ బస్సులు రద్దు చేసింది. ప్రత్యామ్నయంగా హైదరాబాద్​నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులు నడపనున్నట్లు సజ్జనార్​ తెలిపారు. 

ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు ఎంజీబీఎస్ బస్​స్టేషన్​ నుంచి బయల్దేరుతుందని వివరించారు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040 - 69440000, 040 - 23450033 లలో సంప్రదించాలన్నారు.