ఎన్నికల కోడ్ వల్ల పీఆర్సీ ఇవ్వలేకపోతున్నాం: ఆర్టీసీ చైర్మన్ 

ఎన్నికల కోడ్ వల్ల పీఆర్సీ ఇవ్వలేకపోతున్నాం: ఆర్టీసీ చైర్మన్ 

హైదరాబాద్: ఆర్టీసీలో పీఆర్సీ డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉందని.. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఇవ్వలేకపోతున్నామని  ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ స్పష్టం చేశారు.  వచ్చే ఆదాయం బకాయిలకే సరిపోతోందన్నారు. కొత్త బస్సులు వచ్చే వరకు కార్మికులు ఓపికతో ఉండాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చామని తెలిపారు.

సకల జనుల సమ్మె సమయంలో జీతాలు రాని వారికి రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న 5 డీఏల్లో 3 డీఏలకు రూ. 5 కోట్లు చెల్లిస్తామన్నారు.  దసార ఫెస్టివల్ అడ్వాన్స్ రూ.20 కోట్లు,  ఎరియర్స్  రూ.20 కోట్లు చెల్లిస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.