పీసీసీ చీఫ్ రేవంత్​కు ఆర్టీసీ ఆహ్వానం

పీసీసీ చీఫ్ రేవంత్​కు ఆర్టీసీ ఆహ్వానం
  • పార్టీల నేతలకు జేఏసీ ఇన్విటేషన్ 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 16న  “ హైదరాబాద్​లో దశాబ్ది ఉత్సవాలు- ఆర్టీసీ పరిస్థితి,  కార్మికుల పని” అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించనున్నారు.  ఈ మీటింగ్​కు  అన్ని పార్టీల నేతలను జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ఆహ్వానించారు. గురువారం జూబ్లీహిల్స్​లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి మీటింగ్​కు రావాలని రాజిరెడ్డి కోరారు.  

ఈ సందర్భంగా మీటింగ్​కు వస్తానని రేవంత్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్​తో పాటు బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, ఆప్,  వైఎస్సార్‌‌టీపీ, ఏఐటీయూసీల్లో ఇన్విటేషన్లు ఇచ్చినట్లు తెలిపారు.