ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే: జితేందర్ రెడ్డి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే: జితేందర్ రెడ్డి

కేసీఆర్ అబద్ధాల సీఎం అన్నారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. కేసీఆర్ తన అవసరాల కోసం కార్మికులను వాడుకున్నారని ఆరోపించారు. సరూర్ నగర్ లోని సకల జనభేరి కార్యక్రమానికి హాజరైన ఆయన… వారి కష్టాలతో అవసరం లేదు కానీ…ఓట్లు మాత్రమే కావాలని ఆరోపించారు. కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలను సహించబోరన్నారు. విభజన చేయకుంటే.. మీ సుట్టాలకు బంకులు ఎట్లా ఇచ్చావని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు రాత్రనకా… పగలనకా కష్టపడి పనిచేస్తున్నారన్న  జితేందర్ రెడ్డి.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనన్నారు.

ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న సీఎం కేసీఆర్… దివాలా దీసిన కేసీఆర్  ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు జితేందర్ రెడ్డి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీని ప్రభుత్వం చేస్తుంటే ఇక్కడ ఎందుకు చేయరో చెప్పాలని డిమాండ్ చేశారు.