ఆర్టీసీలో వెల్ఫేర్​ కమిటీలను రద్దు చేయాలి

ఆర్టీసీలో వెల్ఫేర్​ కమిటీలను రద్దు చేయాలి
  •  సీఎంకు ఆర్టీసీ స్టాఫ్​ అండ్ ​వర్కర్స్​యూనియన్ ​విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్​పాలన పోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆర్టీసీలో ఇంకా కేసీఆర్​మార్క్​పాలనే కొసాగుతోందని ఆర్టీసీ స్టాఫ్​అండ్​వర్కర్స్​యూనియన్ ఆరోపించింది. వెంటనే వెల్ఫేర్​కమిటీలను రద్దు చేసి యూనియన్లకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరింది. గురువారం యూనియన్​ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి, అడిషనల్ ప్రధాన కార్యదర్శి అబ్రహం, గోపాల్, యూనియన్​సభ్యులు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు.

.ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్​చేసినా, ఇంత వరకూ విలీనం జీవో ఇవ్వలేదన్నారు. 2017, ఏప్రిల్​నుంచి 16 శాతం ఐఆర్​తోనే వేతనాలు చెల్లిస్తున్నారని, ఫిట్​మెంట్​ఇవ్వలేదని వాపోయారు. కోఆపరేటివ్​సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మహాలక్ష్మి పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, పథకం కోసం మరిన్ని కొత్త బస్సులు కొనాలని చెప్పారు