ఆ దేశాల నుంచి వచ్చేటోళ్లకు ఆర్టీపీసీఆర్​ కంపల్సరీ

ఆ దేశాల నుంచి వచ్చేటోళ్లకు ఆర్టీపీసీఆర్​ కంపల్సరీ
  • ఢిల్లీ డిజాస్టర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీ నిర్ణయం

న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌‌‌‌ వైరస్‌‌‌‌ వ్యాప్తిస్తున్నందున హైరిస్క్‌‌‌‌ దేశాల నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణికులందరికీ కచ్చితంగా ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చేయాలని ఢిల్లీ డిజాస్టర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీ (డీడీఎంఏ) నిర్ణయించింది. ఇందులో పాజిటివ్‌‌‌‌ వచ్చిన వారి శాంపిల్స్‌‌‌‌ను జీనోమ్‌‌‌‌ సీక్వెన్సింగ్‌‌‌‌కు పంపించాలని, ఐసోలేషన్‌‌‌‌ను విధిగా అమలు చేయాలని అధికారులు సోమవారం తెలిపారు. సివిల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌ మినిస్ట్రీ, ఇతర డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లు, సంబంధిత మంత్రులను కోఆర్డినేట్‌‌‌‌ అవుతూ వేగంగా నిర్ణయాలు తీసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలని డీడీఎంఏ అధికారులకు రాష్ట్ర సీఎస్‌‌‌‌ సూచించారు.