రైతులకు గుడ్ న్యూస్ : 120 రోజుల్లో పంట వచ్చే .. కొత్త రకం వరి విత్తనాలు విడుదల

రైతులకు గుడ్ న్యూస్ : 120 రోజుల్లో పంట వచ్చే .. కొత్త రకం వరి విత్తనాలు విడుదల

వర్ని, వెలుగు : రుద్రూర్​ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనాస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నూతన వంగడాలను విడుదల చేశారు. పరిశోధనాస్థానం కార్యాలయంలో అధిపతి డాక్టర్ అంజయ్య విలేకరులతో మాట్లాడారు.  చెరుకు పంటలో అధిక లాభాలు పొందవచ్చన్నారు. 2024 లో రుద్రూర్​ వరి  (ఆర్డీఆర్ 1162) స్వల్ప కాలిక రకం విడుదల చేశామన్నారు. 

ఈ రకం రెండు కాలాలకు అనువైనదని వానా కాలంలో (120-, 125) రోజులు, యాసంగిలో (130-, 135) రోజులు పంట కాల పరిమితి కలిగిన మిక్కిలి సన్నగింజ రకం అని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రమ్య, డాక్టర్ రాజుకుమార్​, సాయిచరణ్, తదితరులు పాల్గొన్నారు.