చిరంజీవి ఆరోగ్యంపై వార్తల్లో నిజం లేదు..!

చిరంజీవి ఆరోగ్యంపై వార్తల్లో నిజం లేదు..!

మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురయ్యారని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు ఆయన పీఆర్వో రాజా రవీంద్ర. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, షూటింగ్ లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారని మీడియాకు తెలిపారు. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఉన్నారని చెప్పారు.

చిరంజీవికి ఆరోగ్యం బాగా లేదని, అస్వస్థతకు గురయ్యారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆయన శుక్రవారం (జూన్ 20) క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. చిరంజీవి హెల్దీగా, ఫిట్ గా ఉన్నారని, ఫ్యాన్స్ ఆందోళకు గురి కావద్దని సూచించారు. 

ఇక చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా సెకండ్ షెడ్యూల్‌‌ పూర్తయినట్టు మేకర్స్ తెలియజేశారు. ముస్సోరీలో జరిగిన ఈ షెడ్యూల్‌‌లో  చిరంజీవి, నయనతార మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉన్నారని.. ఆయన ఆరోగ్యంపై పుకార్లు పుట్టంచడం సరికాదని హెచ్చరించారు.