
శంషాబాద్, వెలుగు: రన్నింగ్కారులో మంటలు చెలరేగిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ ఔట్ పోస్ట్ ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బెంజ్కారు ఆదివారం శంషాబాద్ఎయిర్ పోర్ట్ కు వెళ్తోంది. సీఐఎస్ఎఫ్ చెక్పోస్ట్ వద్దకు రాగానే ఇంజిన్ లో నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్శ్రీకాంత్కారును పక్కకు ఆపి, ప్రాణాలు కాపాడుకున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కారు సగానికి పైగా దగ్ధమైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.