మృగశిర కార్తె.. ఫిష్.. రష్

మృగశిర కార్తె.. ఫిష్.. రష్

మృగశిర కార్తె సందర్భంగా గురువారం(జూన్ 09) తెల్లవారుజాము నుంచే గ్రేటర్​సిటీలోని చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. అతిపెద్దదైన రాంనగర్​చేపల మార్కెట్ కు జనం పోటెత్తారు. డిమాండ్​ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు అనేక రకాల చేపలను అందుబాటులో ఉంచారు. కిలో కొర్రమీను రూ.500 నుంచి 600 వరకు, రవ్వు, బొచ్చె చేపలను రూ.120 నుంచి150 వరకు విక్రయించారు.  – వెలుగు, ముషీరాబాద్/శంకరపల్లి