
- 12 మంది మృతి.. పలువురికి గాయాలు
- యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇవే అతిపెద్ద ఎయిర్ స్ట్రయిక్స్
- కనికరం లేకుండా దాడి చేశారు: జెలెన్ స్కీ
- రష్యాపై ఆంక్షలు విధించాలని డిమాండ్
కీవ్: ఉక్రెయిన్ పై రష్కా అతిపెద్ద వైమానిక దాడులు చేసింది. డ్రోన్లు, మిసైళ్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు రష్యా ఈ దాడులు నిర్వహించింది. 2022 ఫిబ్రవరిలోరెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఈ స్థాయిలో ఎయిర్ స్ట్రయిక్స్ చేయడం ఇదే మొదటిసారి. 367 డ్రోన్లు.. మిసైళ్లతో రష్యా తమపై దాడి చేసిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి యురీ స్తత్ తెలిపారు.
రష్యా మొత్తంగా 69 మిసైల్స్, 298 డ్రోన్లు వాడిందని మీడియాకు ఇన్హత్ వెల్లడించారు. సాధారణ నగరాలపై శత్రు దేశం కనికరం లేకుండా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షు డు వోలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు.
మొత్తం 30 నగరాలపై రష్యా అటాక్ చేసిందని 'ఎక్స్' లో ఆయన తెలిపారు. దాడికి గురైన ప్రాంతాల్లో కీస్, జైటోమైర్, ఖైమ్ లైంట్ స్కీ, టెర్నోపిల్, చిర్నిహివ్, సుమై, ఒడెసా, పోల్టావా, ఫో, మైకోలైవ్, ఖర్కివ్, చెర్కాసీ ఏరియాలు ఉన్నాయని వివరించారు. ఈ దాడుల్లో నివాస భవనాలు ధ్వంసం అయ్యాయని కొన్నింటికి డ్యామేజ్ జరిగిందన్నారు. రష్యాపై వెంటనే వెస్టర్స్ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించా అని ఆయన డిమాండ్ చేశారు. ఆంక్షలు విధిస్తే తప్ప రష్యాను ఎదుర్కోలేమని చెప్పాడు. కాగా, తమ దేశంపై ఉక్రెయిన్ 110 ఉక్రెయిన్ డ్రోన్లతో అటాక్ చేసేందుకు యత్నించిందని, వాటన్నింటినీ కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
కీప్ లో రాత్రంతా బాంబుల మోత
రష్యా దాడితో రాజధాని కీవ్ తో పాటుచుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం రాత్రంతా బాంబుల మోత మోగింది. దీంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఒక్క కీప్ లోనే నలుగురు చనిపోగా.. 16 మంది గాయపడ్డారు. రాత్రంతా ప్రజలు నిద్రపోలేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మిసైల్స్, డ్రోన్లు మీద పడడంతో కొన్ని ఇండ్లు, వ్యాపార సముదాయాల నుంచి మంటలు ఎగసి పడ్డాయన్నారు. "జైటోమైర్ లో ముగ్గురు పిల్లలు ప్రాణాలుకోల్పోయారు 12 మంది గాయపడ్డారు. అలాగే, మైకోలైన్ లో ఒకరు మృతి చెందారు. హో లోసివిస్కీ జిల్లాలో ఒక డ్రోన్ నేరుగా స్టూడెంట్ పై పడింది. దాంతో అతను అక్కడికక్కడే చనిపోయా రు.ఓ బిల్డింగ్ గోడ కూడా దెబ్బతిన్నది. నిప్రావ్ స్కీ, షెంచెన్ కిన్ స్కీ జిల్లాల్లో పలు ఇండ్లు ధ్వంస మయ్యాయి" అని ఆ అధికారులు పేర్కొన్నారు
ఆ గ్రామమంతా మంటలు
కీవ్ కు సమీపంలోని మార్కాలివ్ కా గ్రామంపై రష్యా మిసైళ్లు, డ్రోన్లు భీకరంగా దాడిచేశాయి. శనివారం రాత్రంతా ఈ గ్రామం మంటల్లో చిక్కుకుందని స్థానికులు కన్నీరు కార్చారు. 'గ్రామంలో ఎక్కడ చూసినా మంటలు, పొగలు అలుముకున్నాయి. మొత్తం గ్రామం నాశనమైంది" అని వాపోయారు.