ENG vs IND 2025: ఐదు కాదు తొమ్మిది వికెట్లు తీసిన బుమ్రాకు అభినందనలు: సచిన్ టెండూల్కర్

ENG vs IND 2025: ఐదు కాదు తొమ్మిది వికెట్లు తీసిన బుమ్రాకు అభినందనలు: సచిన్ టెండూల్కర్

ఇంగ్లాండ్ తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మార్క్ చూపించాడు. తనపై అంచనాలను నిలబెట్టుకుంటూ అద్భుతంగా రాణించాడు. ఇంగ్లీష్ బ్యాటర్లను వణికిస్తూ 5 వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో భాగంగా మూడు కీలక వికెట్లు తీసుకోగా.. మూడో రోజు మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ కెరీర్ లో 14 వ సారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ గా బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 24.4 ఓవర్లు బౌలింగ్ చేసి 83 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

టీమిండియాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ మాత్రం స్వల్ప ఆధిక్యమైనా దక్కిందంటే అది కచ్చితంగా బుమ్రా వల్లే అని చెప్పక తప్పదు.  పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్నప్పటికీ బుమ్రా తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. దీంతో బుమ్రా బౌలింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. బుమ్రా బౌలింగ్ కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం స్పందించాడు. తన ఎక్స్ ద్వారా ట్వీట్ చేస్తూ అభినందించాడు. " అద్భుతమైన మీ బౌలింగ్ కు అభినందనలు. మీరు 9 వికెట్లు తీసుకోవడానికి ఒక నో-బాల్, 3 మిస్డ్ క్యాచ్ లు వచ్చాయి". అని  టెండూల్కర్ పోస్ట్ చేశాడు. 

ఈ మ్యాచ్ లో బుమ్రా ఐదు వికెట్లు తీయడమే కాదు.. మరో నాలుగు వికెట్లు తీసుకునే అరుదైన అవకాశం లభించేది. బుమ్రా బౌలింగ్ లో జైశ్వాల్ రెండు క్యాచ్ లు.. జడేజా ఒక క్యాచ్ మిస్ చేశాడు. హ్యారీ బ్రూక్ ను ఔట్ చేసినా అది నో బాల్ గా తేలింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో బుమ్రా మరో సరికొత్త చరిత్ర లిఖించాడు. సేనా SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో 150 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన ఆసియా బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ పై తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసుకున్న తర్వాత బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డ్ పాకిస్థాన్  వసీం అక్రమ్ (147) పేరిట ఉంది.  నిలిచింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 23.5 ఓవర్లలో 90/2 స్కోరు చేసింది. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (47 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 96 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది.  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (4) నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే ఔటయ్యాడు. రాహుల్‌‌‌‌‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ (30) నెమ్మదిగా ఆడుతూ క్రమంగా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను గాడిలో పెట్టారు. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో, డే చివర్లో స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (1/18).. సుదర్శన్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి షాకిచ్చాడు. ఫలితంగా రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 66 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది.   

 209/3 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 100.4 ఓవర్లలో 465 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఫలితంగా ఇండియాకు ఆరు రన్స్​ స్వల్ప ఆధిక్యం లభించింది. ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌ (137 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 14 ఫోర్లతో 106) సెంచరీకి తోడు హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌ (99), జెమీ స్మిత్‌‌‌‌‌‌‌‌ (40) రాణించారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.