సదాశివనగర్ మండలంలో సబ్సిడీ పై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ

సదాశివనగర్  మండలంలో సబ్సిడీ పై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ

సదాశివనగర్​, వెలుగు :  మండలంలోని సొసైటీల ద్వారా 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి తెలిపారు.  గురువారం విలేకరులతో మాట్లాడారు. 

 మండలంలోని అడ్లూర్​ ఎల్లారెడ్డి, పద్మాజివాడి, ఉత్తునూర్​, సదాశివనగర్​ సొసైటీల ద్వారా పచ్చిరొట్ట, జీలుగు విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.