సాయిపల్లవి పై నెటిజన్లు ఫైర్

సాయిపల్లవి పై నెటిజన్లు ఫైర్

విరాటపర్వం మూవీ ప్రమోషన్ లో చాలా యాక్టీవ్ గా పాల్గొంటుంది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. రానా దగ్గుబాటితో కలిసి ఆమె కలిసి నటించిన ఈ సినిమా ఈ నెల(జూన్) 17న రిలీజ్ కానుంది. అయితే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మరాయి.  నక్సల్స్ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. " నక్సల్స్ ది ఒక ఐడియాలజీ. మనకు శాంతి అనేది ఒక ఐడియాలజీ. నాకు వయిలెన్స్ అంటే నచ్చదు.వయిలెంట్ గా ఉండి మనం ఏమి సాధించలేమనేది నా అభిప్రాయం"  అంటూ చెప్పుకొచ్చింది.  మాటల్లో మాటగా ‘‘కశ్మీర్ ఫైల్స్’’ సినిమా గురించి సంచలన కామెంట్స్ చేసింది. 

‘‘మా ఫ్యామిలీ లో లెఫ్ట్ రైట్ అని ఉండదు.న్యూట్రల్ గా ఉండే ఫ్యామిలీలో పెరిగాను. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని మనం కూడా చేయకూడదు. బాధితుల గురించి ఆలోచించాలి. కొన్ని రోజుల క్రితం 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమా వచ్చింది .. ఆ టైమ్ లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు .. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్ ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది.’’ అంటూ సాయిపల్లవి కామెంట్స్ చెసింది. 

సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్  కావడంతో  కొందురు నెటిజన్లు ఆమె పైన ఫైర్ అవుతున్నారు. విరాటపర్వం సినిమాను బ్యాన్ చేయాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సాయి పల్లవి కామెంట్స్ ను సమర్ధిస్తున్నారు. కాగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రియమణి కీలకపాత్రలు పోషించారు.