సాయి పల్లవికి రానా సాయం 

సాయి పల్లవికి రానా సాయం 

కర్నూలులో విరాటపర్వం మూవీ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. జోరు వాన ఆటంకం కలిగించినా ఏ మాత్రం వెనక్కితగ్గని అభిమానులు ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు కేరింతలు కొడుతూ ఆమెపై అభిమానం చాటుకున్నారు. ఫ్యాన్స్ గోల మంధ్య ఆమె ఏం మాట్లాడిందో కూడా అర్థం కాలేదు. 
సాయి పల్లవి మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివాన మొదలైంది. అయితే ఆమె తన స్పీచ్ కొనసాగించింది. వాన ఎక్కువ కావడంతో రానా స్వయంగా సాయి పల్లవి కోసం గొడుగు పట్టుకుని నిలబడ్డాడు. అది చూసి అభిమానుల కేరింతలు మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానా చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

సుశాంత్ పేరుతో హోటల్ యజమానికి 8 రూ.లక్షలు టోకరా

ఇవాళ, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన