సుశాంత్ పేరుతో హోటల్ యజమానికి రూ.8 లక్షల టోకరా

 సుశాంత్ పేరుతో హోటల్ యజమానికి రూ.8 లక్షల టోకరా

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​పై సినిమా తీస్తామంటూ ఓ హోటల్​ యజమానిని బురిడీ కొట్టించారు దుండగులు. హోటల్​లోనే సంవత్సరంపాటు ఉంటూ, అద్దె చెల్లించకుండా పారిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

నోయిడా థానా సెక్టార్​-39లోని ఓ హోటల్​లో విజయ్ శేఖర్, నితిన్ పంత్, సచిన్ తివారీ, వరుణ్ ఖండేల్వాల్ అనే పేర్లతో నలుగురు వ్యక్తులు 2020లో నాలుగు గదులు బుక్ చేసుకున్నారు. తాము సినిమా డైరెక్టర్లుగా హోటల్ నిర్వాహకులు, సిబ్బందితో పరిచయం చేసుకున్నారు. సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​పై సినిమా తీస్తున్నామంటూ నమ్మించారు. సుశాంత్​ పాత్రను తాను పోషించనున్నట్లు సచిన్ తివారీ అనే వ్యక్తి తమను నమ్మించాడని హోటల్​ యజమాని వాపోయాడు. ఏడాది పాటు 4 గదుల అద్దె చెల్లించకుండానే రూమ్ లను ఖాళీ చేసి వెళ్లిపోయారని బాధితుడు లబోదిబోమంటున్నాడు. నిందితులు ఇచ్చిన చెక్ కూడా బౌన్స్​ అయ్యిందంటూ కోర్టును ఆశ్రయించాడు. రూ.8లక్షలు మోసపోయానంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు... అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

3వ రోజుకు చేరిన లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ జీర్ణోద్ధరణ

ఇవాళ, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన

మంత్రులను నిలదీసిన ఆర్యవైశ్య నేతలు