కాంగ్రెస్​ను అడ్డుకునేందుకు.. బీఆర్ఎస్​, బీజేపీ కుట్ర: అద్దంకి

కాంగ్రెస్​ను అడ్డుకునేందుకు.. బీఆర్ఎస్​,  బీజేపీ కుట్ర: అద్దంకి

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్​, బీజేపీ కలిసి కుట్రచేస్తున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​ అన్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేసీఆర్, కేటీఆర్​ అంతా కలిసి కాంగ్రెస్​ను అడ్డుకోవాలని చూస్తున్నారని బుధవారం ఓ ప్రకటనలో  ఆరోపించారు. కాంగ్రెస్​లో ఈటల రాజేందర్​ చేరకుండా చూడడంలో  కేటీఆర్​ సక్సెస్​ అయ్యారన్నారు. భవిష్యత్తులో తాను సీఎం కావాలనే ఈటలను కేటీఆర్​ అడ్డుకున్నారని చెప్పారు. 

ఈటలకు సెక్యూరిటీ పెంచడం, దానిపై కేటీఆరే స్వయంగా రివ్యూ చేయడం అందులో భాగమేనన్నారు. ఇక ఢిల్లీలో అమిత్​ షాను కేటీఆర్​ కలవలేకపోయారంటున్నారని, కానీ, జూమ్​ మీటింగ్​లో వాళ్లిద్దరూ చర్చలు జరిపినట్లు తమకు తెలిసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ భూస్థాపితమైందని, బీఆర్ఎస్​ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.