ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీపీ సజ్జనార్ తన మార్క్ ను చూపిస్తున్నారు. తరచూ బస్టాండులలో తనిఖీ చేయడం.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం లాంటివి చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు.
రీసెంట్ గా బస్సులో గుట్కాలు నమిలి ఉమ్మడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేటెస్టుగా సజ్జనార్ హైదరాబాద్ నుండి నల్గొండ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ బస్టాండ్ లో ఉన్న అసౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత నల్గొండ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల రివ్యూ తీసుకోవడంతోపాటు ఆర్టీసీ కార్గో సేవలను కూడా పరిశీలించారు.