పువ్వుల కారణంగా ఎమర్జెన్సీకి సమంత.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

పువ్వుల కారణంగా ఎమర్జెన్సీకి సమంత.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తన అద్భుతమైన  నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 14 ఏళ్ళ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. అంతేకాదు సౌత్ లో ఉన్న దాదాపు అందురు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకున్నారు. ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూనే ఉంటారు. తన సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

అంతేకాదు.. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు కూడా క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటి పెట్టారు సమంత. ఎవరికైన పువ్వులంటే ఇష్టం ఉంటుంది. కానీ, నాకు మాత్రం అలర్జీ. ఈ పూల వల్లే ఒకసారి ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లాను. ఇప్పుడు చాలా రోజుల తర్వాత పూల దగ్గరకు వచ్చాను. ఇవి నన్ను భయపెడుతున్నాయి. పువ్వులతో నరకం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది.. అంటూ రాసుకొచ్చారు సామ్. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె సిటాడెల్ హిందీ వర్షన్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వవ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది కాకుండా మరో రెండు బాలీవుడ్ భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు.