
కరీంనగర్ సిటీ, వెలుగు: దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడానికి పోరాటం చేసి విజయం సాధించిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అని రాష్ట్ర ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి అన్నారు. శుక్రవారం నగరంలో సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించారు.
ఇందిరా చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సీవీఆర్ఎన్ రోడ్డు మీదుగా కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఎన్ఎస్ యుఐ ఉపాధ్యక్షుడు ఎం.డి ఇమ్రాన్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పరి విశాల్ ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొన్నారు.