
వరుస విజయాలతో తక్కువ సమయంలోనే టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా దూసుకెళుతోంది సంయుక్త. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో బిజీగా ఉన్న ఆమె ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. ఇందులో నటించే కీలక నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్న మేకర్స్.. ఇప్పటికే టబు, దునియా విజయ్లను ఇంట్రడ్యూస్ చేశారు. తాజాగా లక్కీ ఛార్మ్ సంయుక్త ఇందులో హీరోయిన్గా నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
సినిమాలో ఎంతో ప్రాధాన్యత గల పాత్రను తను పోషించబోతోందని, భావోద్వేగాలతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలో తను కనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫస్ట్ షెడ్యూల్కు సంబంధించిన లొకేషన్స్ కోసం ఇటీవల హైదరాబాద్, చెన్నైలలో రెక్కీ నిర్వహించారు. జూన్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, క న్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానుంది.