చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని ఈసీ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న జేసీబీ, టిప్పర్ను పోలీసులు శనివారం అర్ధరాత్రి సీజ్ చేశారు. ఈసీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో హెడ్కానిస్టేబుల్ వి. చంద్రశేఖర్, కానిస్టేబుల్ అనిల్ కలిసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జేసీబీ సహాయంతో టిప్పర్లో ఇసుక నింపుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అయితే పోలీసులను గమనించిన డ్రైవర్లు వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో ఆ జేసీబీ, టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణలో ఈ వాహనాలు పోతుగల్ గ్రామానికి చెందిన కేశపల్లి కరుణాకర్ రెడ్డికి చెందినవిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కాంతారెడ్డి వెల్లడించారు.
