
మెట్ పల్లి, వెలుగు: ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు స్పాట్లోనే చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులో జరిగింది. ఎస్సై కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. మెట్ పల్లి మండలం బండలింగపూర్ కు చెందిన గుగ్గిల రాజు, ప్రవళిక కొడుకు రవికుమార్(18) ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు.
గురువారం మధ్యాహ్నం స్నేహితులను కలిసి వస్తానని ఇంటి నుంచి బైకుపై మెట్ పల్లికి వచ్చాడు. రాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా పట్టణ శివారులో వెల్లుల్ల వైపు నుంచి ఇసుక లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ రవి బైకును ఢీ కొట్టడంతో అతడి తల రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించి, ట్రాక్టర్ ను పీఎస్కు తరలించారు. మరో 15 నిమిషాల్లో ఇంటికి వస్తున్న అని ఫోన్ చేసి చెప్పిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.