Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” విడుదలపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” విడుదలపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

యానిమల్(Animal) సక్సెస్ తో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir Kapoor). నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. మొదటిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. లాగ్ రన్ లో ఏకంగా రూ.900 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో సందీప్ రెడ్డి వంగ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇక ఆయన తరువాతి సినిమాలపై ఇప్పటినుండే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. 

తాజాగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ అప్డేట్ ఇచ్చారు.ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా ఈ విషయాన్ని తెలియజేసారు. మరో నెలరోజుల్లో స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నాడట.యానిమల్ పార్క్ షూటింగ్ 2025 ఎండింగ్ లో మొదలు పెట్టి 2026 లో రిలీజ్ చేయనున్నట్లు సందీప్ వెల్లడించారు. ఈ సినిమా యానిమల్ కంటే మరింత వైల్డ్ గా ఉండబోతున్నట్లు తెలిపాడు. 

Also Read:గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్..వరుడు కూడా ఫేమస్ హీరోనే

అయితే సందీప్ చెప్పిన ప్రకారం చూస్తే..ప్రస్తుతం ప్రభాస్‍తో తెరకెక్కించే ‘స్పిరిట్’ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని తెలుస్తుంది.ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ తెలిపారు.సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ షురూ కానుందని ఆయన తెలిపారు. మరి భారీ అంచనాలున్న యానిమల్ పార్క్ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. 

అలాగే యానిమల్ సీక్వెల్కు సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. యానిమల్  సినిమా సీక్వెల్ కోసం హీరోయిన్ ను మార్చనున్నాడట సందీప్. యానిమల్ సినిమాలో తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది రష్మిక మందన్నా.. కానీ రెండో పార్టీ లో ఆమె స్థానంలో మళయాళ భామ మాళవిక మోహనన్ ను తీసుకోనున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.