'డొనేట్ కార్ట్' తో సోషల్ సర్వీస్చేస్తున్న సందీప్ శ్రీవాత్సవ్ శర్మ
కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయికి చెందిన నందుల సందీప్ శ్రీవాత్సవ్ శర్మ(26)కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా –30 - లిస్టులో మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్గా సందీప్ శర్మకు స్థానం లభించింది. నాగపూర్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చేసిన శ్రీ వాత్సవ్తన ఫ్రెండ్ అనిల్ రెడ్డితో కలిసి డొనేట్ కార్ట్ సంస్థను ప్రారంభించాడు. ఈ ఆర్గనైజేషన్ దేశంలోని పలు ఎన్జీఓలతో కలిసి పని చేస్తోంది. పేదవారికి అవసరమైన ఫండ్, ఇతర వస్తువులను డోనర్స్ నుంచి కలెక్ట్ చేసి ఇప్పిస్తూ మీడియేటర్గా వ్యవహరిస్తోంది. 2017లో ముంబై కేంద్రంగా ప్రారంభించిన ఈ సంస్థ150 కోట్లకు పైగా ఫండ్స్కలెక్ట్ చేసి పలు ఎన్జీఓలకు కావలసిన వస్తువులను సమకూర్చింది. ప్రస్తుతం హైదరాబాద్ టి హబ్ కేంద్రంగా పని చేస్తోంది. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు బాధితులకు డ్రింకింగ్వాటర్, చద్దర్లు , ఫుడ్, మెడిసిన్అందజేసింది. కరోనా టైంలో రోజువారీ, వలస కూలీలకు ఎన్జీఓలతో కలిసి డెయిలీ నీడ్స్, హాస్పిటల్స్ కు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, బెడ్స్, పల్స్ మీటర్స్, మెడికల్ కిట్స్ సమకూర్చింది. ముంబైలోని ధారావిలోని రోజువారీ కార్మికులకు నెలకు సరిపడ వస్తువులను ఇచ్చింది. సూర్యాపేటలోని హాస్పిటల్ కి ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చెందిన యూవీ ఫౌండేషన్నుంచి కావలసిన వస్తువులను ఇవ్వడంలో కీలకపాత్ర పోషించింది. ఈ సేవలను గుర్తించిన ఫోర్బ్స్ ఇండియా ఈ ఏడాది లిస్టులో శ్రీవాత్సవ్తో పాటు చిత్తూరు జిల్లా కొత్తకొటకు చెందిన అనిల్రెడ్డికి కూడా చోటిచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వీరికి విషెష్ చెప్పారు.